Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు!

తెలంగాణ రాష్ట్రంలో మార్చి ప్రారంభం నుండే భానుడు భగభగమంటున్నాడు. అప్పుడే కొన్ని జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండే వేడి మొదలవుతుంది. 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది.

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం

భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాలలో ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు.

imd warning high temperature over 40 degrees in telangana districts said to take care in summer

ఈ జిల్లాల ప్రజలకు అలెర్ట్

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య వేడి, ఉక్కపోత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆకాశం నిర్మలంగా ఉండడంవల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని అధికారులు చెబుతున్నారు.

తూర్పు, ఉత్తర తెలంగాణలో అధికంగా ఎండలు

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఎండ ప్రభావం మరింత అధికంగా ఉందని, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల సెల్సియస్ దాటాయి అని, నేడు ఈ జిల్లాలలో పొడి గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

వరంగల్ కు వరమిచ్చిన తెలంగాణా ప్రభుత్వం.. ఆ భారీ ప్రాజెక్టుకు రూ.5257 కోట్లు!
వరంగల్ కు వరమిచ్చిన తెలంగాణా ప్రభుత్వం.. ఆ భారీ ప్రాజెక్టుకు రూ.5257 కోట్లు!

ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ఇలా చెయ్యండి

ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండాకాలం తరచూ నీళ్ళు తాగాలని బారిన పడకుండా నివారించుకోవాలి అని సూచిస్తున్నారు. ఆహారం విషయంలో కూడా తేలికపాటి ఆహారాన్ని తీసుకుని శ్రద్ధగా ఉండాలని చెబుతున్నారు. పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని సూచిస్తున్నారు. మసాలా ఫుడ్స్ తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+