మునుగోడులో కీలకంగా మారిన తెలుగుదేశం!?
ఉప ఎన్నికలు అలవాటుపడిన తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎటువంటి ఎన్నికలూ లేవు.. నేరుగా సాధారణ ఎన్నికలే అనుకుంటున్న తరుణంలో మునుగోడు రూపంలో మరో ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.

హోరాహోరీగా ఢీకొంటున్న పార్టీలు
కోమటిరెడ్డిని ఢీకొట్టడానికి, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి సంగ్రామంలోకి దిగారు. అధికార పార్టీ తరఫున చివరి నిముషంలో రంగంలోకి దిగిన కూసుమంచి ప్రభాకర్ రెడ్డి మరోవైపు నుంచి మొహరించారు. నియోజకవర్గ పరిధిలో కీలకమైన నాయకులను కలవడంలోను, ప్రచారం చేయడంలోను, పంపిణీలోను బీజేపీ ముందంజలో ఉంది. అధికారి పార్టీగా ఉండే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో, వ్యవస్థలను వాడుకోవడంతోపాటు సెంటిమెంటును రగిలించే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది.

సెటిలర్ల ఓట్లపై దృష్టి
పార్టీ అంతర్గత వ్యవహారాలను చూసుకుంటూ, అన్ని వనరులను సమకూర్చుకొని బీజేపీ, టీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంతోపాటు డిజిటల్ క్యాంపెయిన్ లో కూడా చురుగ్గా ఉంది. ఏ పార్టీకా పార్టీ వారి వారి బాటల్లో వేగంగా దూసుకువెళుతున్నాయి.. బీజేపీకి ఇది సెమీఫైనల్ లాంటిది. గెలిస్తేనే రాష్ట్రంలోని ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పుకోవడంతోపాటు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తాజాగా ఈ మూడు పార్టీలు ఇక్కడి టీడీపీ ఓటర్లపై దృష్టి సారించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు సమీపంలోనే ఉండే మనుగోడులో సెటిలర్ల ఓట్లున్నాయి. ముదిరాజ్, యాదవ, గౌడ తదితర బీసీ వర్గాలతో కలిపి 10 నుంచి 12వేల వరకు ఓట్లుంటాయని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి.

సెటిలర్ల ఓట్లపై దృష్టి
పార్టీ అంతర్గత వ్యవహారాలను చూసుకుంటూ, అన్ని వనరులను సమకూర్చుకొని బీజేపీ, టీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంతోపాటు డిజిటల్ క్యాంపెయిన్ లో కూడా చురుగ్గా ఉంది. ఏ పార్టీకా పార్టీ వారి వారి బాటల్లో వేగంగా దూసుకువెళుతున్నాయి.. బీజేపీకి ఇది సెమీఫైనల్ లాంటిది. గెలిస్తేనే రాష్ట్రంలోని ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పుకోవడంతోపాటు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తాజాగా ఈ మూడు పార్టీలు ఇక్కడి టీడీపీ ఓటర్లపై దృష్టి సారించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కు సమీపంలోనే ఉండే మనుగోడులో సెటిలర్ల ఓట్లున్నాయి. ముదిరాజ్, యాదవ, గౌడ తదితర బీసీ వర్గాలతో కలిపి 10 నుంచి 12వేల వరకు ఓట్లుంటాయని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications