భారత ఎన్నికలపై నువ్వేందుకు మాట్లాడతావు ? అసదుద్దీన్ ఓవైసీ
ప్రధాని మోడి ఎన్నికపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్ ప్రధానికి లేదని ఆయన మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ , ఐఎస్ఐ కంట్రోల్ చేసే వ్యవస్థ నుండి వచ్చాడని ఇండియాలో స్వేఛ్చయుత ఎన్నికలు ఉంటాయని అన్నారు. అలాంటప్పుడు అయన భారత ఎన్నికలపై మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.

చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడీయా తో మాట్లాడారు. కాగా మతాల అంశంపై మాట్లాడిన సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం వార్ధా లో మోదీ కామెంట్స్ కు మాత్రం స్పందించకపోవడంపై ఆయన అశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా భారత్ లో మళ్లి మోడి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తే కశ్మీర్ పై చర్చలకు అవకాశం ఉంటుంది అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.












Click it and Unblock the Notifications