వామ్మో .. రెండురోజులుగా బావిలోనే ... తాడు సాయంతో పైకి
హైదరాబాద్ : అప్పుడప్పుడు అనుకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ కొందరు బయటపడుతుంటారు. మరికొందరు మాత్రం ఆ ప్రమాదం తాలుకు జ్ఞాపకాలు కూడా కలలో వచ్చి ఉలిక్కిపడతారు. కానీ వరంగల్ అర్బన్లో ఉలిక్కిపడటం దేవుడేరుగు .. ప్రమాదం జరిగి రెండురోజులు ఓ పాడుబడ్డ బావిలోనే ఉన్నాడో వ్యక్తి. ఇది తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది .. మరీ అందులో పడ్డ మొగిలి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఒళ్లు గగుర్పొడిచే ఘటన
వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం ముచ్చర్ల వద్ద రెండురోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ తో వెళ్తున్న మొగిలి అనే వ్యక్తి ఓ పాడుబడ్డ బావిలో పడిపోయాడు. అందులో నీళ్లు లేకపోవడంతో .. బావిలో లోపల పడటంతో అతనికి ఏం గాయాలు కాకపోవడం గమనార్హం. కానీ అతని అరణ్యవేదన వినే నాథుడే లేకపోయాడు. ఆకలికి అలమటించి .. దాహనికి నోరెండుకపోయి అల్లాడిపోయాడు. ఇక రెండురోజులు ఎలా గడిచిందో తెలియదని అంటున్నాడు మొగలి. తన అరుపులు విన్న కొందరు సాయంతో తాడుతో పైకి వచ్చిన మొగిలి తనకు పున:జన్మ వచ్చిందని చెప్తున్నాడు.

సాయం కోసం ఆర్తనాదం
గురువారం బావిలో పడ్డ మొగిలి సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి నోరు కూడా బొంగురుపోయింది. చివరకు దారినపోయే దానయ్య .. చూసి తాడు వేసి పైకి వచ్చేందుకు సాయం చేశాడు. పైకొచ్చిన మొగిలి .. ఇదీ తనకు పున:ర్జన్మ అని చెప్తున్నాడు. సాయం చేసిన వారు దేవుళ్లని కీర్తస్తున్నాడు.












Click it and Unblock the Notifications