Crime News: బెదిరింపు.. హత్యకు దారి తీసింది.. అస్సలు ఏం జరిగిందంటే..
భర్త వేధింపులు భరించలేని ఓ భార్య అతన్ని బెదిరించాలనుకుంది. తన మేనమామతో చెప్పి నీ భార్యని వేధిస్తే చంపేస్తాంటూ బెదిరించాలని సూచించింది. కానీ ఈ బెదిరింపు కాస్త హత్యకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే పహడీషరీఫ్ కు చెందిన మహ్మద్ జుబేర్ 2014సో జరీనాబేగం అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే జుబేర్ అనేక నేరాల్లో నిందితుడిగా ఉండడంతో అతడిపై రాజేంద్రనగర్ ఠాణాలో రౌడీషీట్ ఉంది.

బృందంగా ఏర్పాటు
అతను కొందరు యువకులను చేరదీసి బృందంగా ఏర్పాటు చేసి సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో భార్య జరీనాబేగంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అయినా జుబేర్ వేధింపులు ఆగలేదు.అయితే అప్పటికే జుబేర్ తో వ్యాపార లావాదేవీల్లో గొడవలున్న జరీనాబేగం మేనమామ మహ్మద్ బాబూఖాన్ కు జరీనాబేగం తన భర్త వేధిస్తున్నాడని చెప్పింది. తనను వేధించకుండా అతన్ని బెదిరించాలని కోరింది.

ఈనెల 14న
దీంతో బాబూఖాన్ జుబేర్ కు ఫోన్ చేసి జరీనా బేగంను వేధిస్తే ప్రాణాలతో ఉండవని బెదిరించాడు. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న జుబేర్ ఈనెల 14న హస్సన్నగర్ సలీమా హోటల్ వద్ద ఉన్న బాబూఖాన్పై తన అనుచరులతో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మహ్మద్ జుబేర్(38), రాహుల్రాజు తడార్(24), మహ్మద్ ఓమర్ఖాన్(35), మహ్మద్ ఉస్మాన్(34), మహ్మద్ ఖదీర్(38), మహ్మద్ ఇమ్రాన్(36)లను రిమాండ్ కు పంపారు. వారి నుంచి 4 కత్తులు, 2 దేశవాళీ పిస్తోళ్లు, 6 బుల్లెట్లు, ఆటో, ద్విచక్రవాహనం, 6 మొబైల్ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

రాహుల్ రాజు తడాస్
ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్ రాజు తడాస్ ఏప్రిల్లో మహారాష్ట్రలో ఓ వ్యక్తిపై దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడికి పారిపోయాయి వచ్చాడు. తర్వాత జుబేర్ గ్యాంగ్ లో చేరాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications