ఫీజు పెంపు మన సాఫ్ట్వేర్ కంపెనీలకు దెబ్బనే: మోహన్ రెడ్డి
హైదరాబాద్: హెచ్1బీ, ఎల్1 వీసాపై ప్రత్యేక ఫీజు పెంపు దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఐటీ రంగ మండలి నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్(హైసియా) సిల్వర్ జూబ్లీ ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను రెండింతలు పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం రక్షణాత్మక చర్యలకు నిదర్శమని అంటూనే అది దేశీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఇప్పటికీ అమెరికాలో నిపుణులకు కొరత ఉందని, ముఖ్యంగా స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్) విభాగాల్లో చాలా మంది నిపుణులు అవసరమని ఆయన అన్నారు.

వీసా ఫీజు పెంపుతో కలిగే ప్రతికూల పరిణామాలపై యూఎస్కు చెందిన పలు ఫోరమ్లపై ఇప్పటికే ఇండస్ట్రీ ఆవేదన వ్యక్తం చేసిందని మోహన్ రెడ్డి చెప్పారు. భారత ఐటి పరిశ్రమల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనం కలిగిందని, ఇప్పు అలాంటి కంపెనీలనే దెబ్బ తీసే విధంగా నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
అత్యున్నత నిపుణులు అవసమరమైన అమెరికన్ కంపెనీలను ఈ నిబంధన దోచుకోనుందని గురువారం విడుదల చేసిన స్టేట్మెంట్లో నాస్కామ్ పేర్కొంది. చాలా వరకు అమెరికా కంపెనీలు ఐటీ కార్యకలాపాలను విదేశాలకు తరలించాల్సి రావచ్చని అభిప్రాయపడింది. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనుందని, ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గవచ్చని తెలిపింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications