ఇందిరమ్మ ఇళ్ల స్కాంపై వివరాలు ఇవ్వాలని లేఖ: త్వరలో సీఐడీ ఛార్జీషీట్

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణంపై త్వరలో సీఐడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల బోగస్ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని విజిలెన్స్‌కు సీఐడీ లేఖ రాసింది. ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడెప్పుడు నిర్మించారన్న దానిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి నివేదిక రాగానే సీఐడీ ఛార్జీషీట్ దాఖలు చేయనుంది. గతంలో 9 జిల్లాల్లో శాంపిల్స్ కింద సీఐడీ దర్యాఫ్తు చేసింది. 36 గ్రామాల్లో 3వేల ఇళ్ల నిర్మాణంలో గోల్ మాల్ జరిగినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు. రూ.11 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు సీఐడీ తేల్చింది.

Indiramma Housing Scam in Telangana: CID to file chargesheet

ఇటీవల కేసీఆర్ పలు కేసులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశమై కేసులపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు అంశం అందరిలోను నానింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సీఐడీ లేఖ రాయడం గమనార్హం.

గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+