సీఎం రేవంత్ - కేసీఆర్ మధ్య అసెంబ్లీలో ఊహించని పరిణామం, సభ్యులంతా సైలెన్స్..!!
తెలంగాణ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలం తరువాత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల అంశాల పైన కేసీఆర్ - రేవంత్ మధ్య కొద్ది రోజులుగా డైలాగ్ వార్ సాగుతోంది. దీంతో, అసెంబ్లీ వేదికగా ఈ అంశాల పైన చర్చించేందుకు ఇద్దరు నేతలు సిద్దమయ్యారు. ఈ సమయం లో సభకు కేసీఆర్ రావటం.. అటు ప్రభుత్వం చర్చకు సిద్దమైంది. కాగా, సమావేశాల తొలి రోజు రేవంత్ - కేసీఆర్ జరిగిన ఆసక్తి కర పరిణామం పైన చర్చ కొనసాగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు (సోమవారం) ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర రెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి శాసనసభ సంతాపం తెలియజేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాప తీర్మానాలను సభలో చదివి వినిపించారు. మాజీ ఎమ్మెల్యేల ఆత్మకు శాంతి చేకూరాంటూ సభలో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కాగా.. సమావేశాల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సభలోకి రాగానే ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసీఆర్ కూర్చున్న సీటు దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి...మంత్రులు పలకరించారు. కేసీఆర్ ఆరోగ్య విషయంపై ఆరా తీసారు.

అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. సమావేశాలకు ప్రారంభం కాగానే జాతీయ గీతం ఆలపించారు. సభకు వచ్చిన కేసీఆర్ ను సీఎం.. మంత్రులు పరామర్శ వేళ అన్ని పార్టీల సభ్యులు ఆసక్తి గా గమనించారు. అటెండెన్స్ లో సంతకం చేసిన కేసీఆర్.. ఆ తరువాత సభలోకి వచ్చారు. జాతీయగీతం పూర్తవగానే సభనుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. ఇక.. ఈ రోజున బీఏసీ జరగనుంది. సమావేశాల నిర్వహణ.. అజెండా పైనా నిర్ణయం తీసుకోనున్నారు. కేసీఆర్ ఈ రోజు హాజరైన వెంటనే వెళ్లిపోవటంతో... మిగిలిన రోజులు సభకు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారుతోంది. కాగా.. సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
-
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!!












Click it and Unblock the Notifications