Alert: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ మార్పు, 28 నుంచే
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికుల డిపార్చర్స్ కోసం ఏర్పాటు చేసిన టెర్మినల్ ఇకపై మూతపడనుంది. నవంబర్ 28 మధ్యాహ్నం నుంచి ఆ టెర్మినల్ను మూసివేస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ అధికారులు ప్రకటించారు.
అంతేగాక, అంతర్జాతీయ డిపార్చర్ టెర్మినల్ తిరిగి ప్రధాన టెర్మినల్కు మారిందని, కొత్త డిపార్చర్ హాల్ నవంబర్ 28, మధ్యాహ్నం 1 గంట నుంచి పనిచేస్తుందని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. దీని గురించి ప్రయాణికులకు తెలియజేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.
మొదటి అంతర్జాతీయ విమానం SV-753 కొత్త డిపార్చర్ హాల్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్ అవుతుంది, ఈ కొత్త అంతర్జాతీయ డిపార్చర్ హాల్ ప్రారంభంతో, ప్రస్తుత ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (ఐఐడీటీ) రద్దు చేయబడుతుంది. ప్రయాణీకులు మార్పును గమనించి, ఏదైనా తదుపరి సమాచారం కోసం విమానాశ్రయ వెబ్సైట్ www.hyderabad.aeroని సందర్శించాలని లేదా విమానాశ్రయ సమాచార డెస్క్ని +91-40-66546370లో సంప్రదించాలని సూచించారు.
విమానాశ్రయంలోని అన్ని ప్యాసింజర్ టచ్ పాయింట్లలో సమాచార వ్యాప్తికి విమానాశ్రయం తగిన ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా కమ్యూనికేషన్ జరుగుతోందని శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.