బీజేపీకి మరక: రేవంత్ వెంట ఉంది బీజేవైఎం నేత?
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యుడు స్టీఫెన్ సన్కు లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉదయ్ సిన్హా కూడా అరెస్టయ్యాడు. రాజకీయాల్లో టీడీపీ - బీజేపీలు దోస్తీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉన్న ఉదయ్ సిన్హా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉప కార్యదర్శిగా వార్తలు వస్తున్నాయి. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఉదయ్ సిన్హా యువనేత రేవంత్ రెడ్డి అనుచరుడు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడికి, ఉదయ్ సిన్హాకు మంచి సంబంధాలు ఉన్నాయి.

ఓటు కొనుగోలు ఉదంతంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం, బీజేవైఎం నేత ఉండటంతో క్రమశిక్షణ కలిగిన బీజేపీకి అవినీతి మరక అంటినట్లయిందని అంటున్నారు.
కాగా, రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లను న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. రేవంత్ రెడ్డి జైలుకు వచ్చిన నేపథ్యంలో జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు రేవంత్, మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రేవంత్కు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, అనంతరం అసెంబ్లీకి, అక్కడి నుండి జైలుకు తరలించారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications