బీజేపీకి మరక: రేవంత్ వెంట ఉంది బీజేవైఎం నేత?
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ శాసన సభ్యుడు స్టీఫెన్ సన్కు లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉదయ్ సిన్హా కూడా అరెస్టయ్యాడు. రాజకీయాల్లో టీడీపీ - బీజేపీలు దోస్తీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు ఉన్న ఉదయ్ సిన్హా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉప కార్యదర్శిగా వార్తలు వస్తున్నాయి. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఉదయ్ సిన్హా యువనేత రేవంత్ రెడ్డి అనుచరుడు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడికి, ఉదయ్ సిన్హాకు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఓటు కొనుగోలు ఉదంతంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం, బీజేవైఎం నేత ఉండటంతో క్రమశిక్షణ కలిగిన బీజేపీకి అవినీతి మరక అంటినట్లయిందని అంటున్నారు.
కాగా, రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లను న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. రేవంత్ రెడ్డి జైలుకు వచ్చిన నేపథ్యంలో జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు రేవంత్, మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. రేవంత్కు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, అనంతరం అసెంబ్లీకి, అక్కడి నుండి జైలుకు తరలించారు.