తెలంగాణాలో మళ్ళీ ఐటీ దాడులు; బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇళ్ళు, కార్యాలయాలపై 70బృందాలతో ఏకకాలంలో రైడ్స్!!
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార వర్గాలను, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా బీఆర్ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి.
ఈరోజు ఉదయం నుండి 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు చేపడుతున్నాయి. అలాగే శేఖర్ రెడ్డి దగ్గర పనిచేసే సిబ్బంది ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.దాదాపు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.

ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీలలో బినామీగా ఉన్నాడని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నారని సమాచారం.
ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కి సంబంధించి హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే భార్య వనిత డైరెక్టర్ గా ఈ కంపెనీలకు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
మొత్తం ఆయనకు సంబంధించి 12 చోట్ల ఏకకాలం లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొత్తపేటలోని కార్యాలయాలతో పాటుగా, భువనగిరిలోని ఆయన ఆస్తులపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి . ఇక ఈ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలలో టెన్షన్ నెలకొంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications