పన్ను ఎగవేతదారులు: తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది, కానీ
ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన 29 మంది డిఫాల్టర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. అందులో 9 మంది హైదరాబాద్ చిరునామాగా చూపించగా, 5గురు వైజాగ్ చిరునామాతో ఉన్నారు.
హైదరాబాద్: ప్రభుత్వానికి పన్నులు ఎగవేసిన 29 మంది డిఫాల్టర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 14 మంది ఉన్నారు. అందులో 9 మంది హైదరాబాద్ చిరునామాగా చూపించగా, 5గురు వైజాగ్ చిరునామాతో ఉన్నారు.
ప్రభుత్వానికి పన్ను ఎగవేసిన వారు మొత్తం 29. వీరంతా కలిసి 448.02 కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టినట్లు ఆదాయపన్ను శాఖ బయటపెట్టింది. ఉద్దేశ్యపూర్వకంగా ఆదాయపన్ను, కార్పోరేట్ పన్నులు ఎగవేస్తున్న వారి పేర్లను బట్టబయలు చేసి వారి పరువును రచ్చకీడ్చే వ్యూహంలో భాగంగా ఈ పేర్లను బయటపెట్టారు.

ఇందులో వ్యక్తులతో పాటు సంస్థలు ఉన్నాయి. 29 మందిలో 26 మంది ఆచూకీ తెలియని వ్యక్తులు, సంస్థల విభాగంలో ఉన్నారు. 29 మందిలో తెలుగువారు 14 మంది డిఫాల్టర్లు ఉన్నప్పటికీ.. బకాయీల్లో వీరి వాటా మాత్రం రూ.55.72 కోట్లు.
సంస్థలు ఎగవేతలకు పాల్పడిన కేసుల్లో డైరెక్టర్ల పేరును ప్రకటనలో పేర్కొన్నారు. పాన్ నెంబర్, చివరిసారిగా తెలిసిన అడ్రస్, ఏయే అసెస్మెంట్ సంవత్సరాల్లో పన్ను ఎగవేశారు, ఎంత మొత్తం ఎగవేశారు.. తదితర వివరాలున్నాయి.
ఇక, మొత్తం రూ.448 కోట్ల బకాయిలలో సగం పైగా ఒకే వ్యక్తి పేరిట ఉన్నాయి. లక్నోకు చెందిన ఇర్ఫాన్ హబీబ్ రూ.257.44 కోట్ల ఆదాయపన్ను ఎగవేసినట్లుగా వెల్లడించారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications