వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైద్రాబాద్కు మరో అరుదైన అవకాశం: మోడీ ట్వీట్కు కెటిఆర్ స్పందన
హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ 28వ, తేదినుండి 30వ, తేది వరకు హైద్రాబాద్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు.
ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ టూర్: మోడీ ఆహ్వనం మేరకే....
మోడీ ట్వీట్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ప్రధాని మోడీ ట్వీట్ను రీట్వీట్ చేశారు. గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్స్ సదస్సుకు హైద్రాబాద్ను వేదికగా చేసుకొన్నందుకుు ప్రధానికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడ హజరుకానున్నారు. అయితే ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ టూర్ కోసం స్వాగతం పలకనున్నట్టు కెటిఆర్ ప్రకటించారు. మరోవైపు చారిత్రక నగరంలో చారిత్రక సదస్సు నిర్వహణ కోసం అవకాశం రావడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
English summary
India and the US will co-host the Global Entrepreneurship Summit at Hyderabad from November 28 this year and the American delegation will be led by President Donald Trump's daughter Ivanka .
Story first published: Friday, August 11, 2017, 0:20 [IST]