గోల్కోండ కోటను చూసి థ్రిల్లయ్యా: ఇవాంకా ట్రంప్ ట్వీట్
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సమ్మిట్లో తన అనుభవాలను ట్వీట్ చేశారు. ముఖ్యంగా హైద్రాబాద్లో గోల్కొండ కోటను సందర్శించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోల్కోండ కోటను సందర్శించడమే తన పర్యటన ముగింపుకు పరిపూర్ణంగా నిలిచిందని ఆమె అభిప్రాయపడ్డారు.
Recommended Video

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహదారుడిగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సదస్సుకు అమెరికా ప్రతినిధులకు సారధ్యం వహించారు. జీఈఎస్ 2017 సదస్సు ప్రధానంగా మహిళలపై ఫోకస్ చేసింది.
దక్షిణాసియాలో జరుగుతున్న తొలి సదస్సుగా హైద్రాబాద్ సదస్సు రికార్డు సృష్టించింది. అయితే ఈ సదస్సుకు 1600 మంది ప్రతినిధులు హజరైతే వారిలో సగం మంది మహిళలే ఉన్నారు.
హైద్రాబాద్ పర్యటనపై ఇవాంకా ట్వీట్
రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఇవాంకా ట్రంప్ అమెరికాకు బుదవారం రాత్రి తిరిగి వెళ్ళారు. అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత ఇవాంకా ట్రంప్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జీఈఎస్ 2017 సమ్మిట్ గురించి ఆమె తన ట్వీట్లో ప్రస్తావించారు.హైదరాబాద్ను నుంచి వచ్చే ముందు గోల్కొండ కోటకు వెళ్లాను. కొంతమంది అమెరికా ప్రతినిధులతో కలిసి కోటలో పర్యటించా. హైదరాబాద్ పర్యటనకు పరిపూర్ణమైన ముగింపు ఇదేనని గోల్కొండ కోటను చూశాక అనిపించిందని ఆమె తన ట్వీట్లో ప్రస్తావించారు.

గోల్కొండ కోట చరిత్రపై ఆసక్తి
గోల్కొండ కోటను చూసి ఇవాంకా చాలా థ్రిల్కు ఫీలయ్యారని ఇవాంకా ట్రంప్కు కోట చరిత్రను వివరించిన గైడ్లు చెప్పారు. కోట గురించిన వివరాలను ఇవాంకా ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. కోటలో ఆయుధగారం, రాణీమహల్ ప్రాంగణం, అక్కన్న, మాదన్న కార్యాలయాలను ఆమె సందర్శించారు.

మా దేశంలో లేవు
శతాబ్దాల క్రితం కోటలో వెల్లివిరిసిన రాజవైభవాన్ని వివరిస్తుంటే అమితాసక్తితో విన్నారు.. అలసటన్నది లేకుండా నడుచుకుంటూనే అక్కడ వివిధ ప్రదేశాలను చూస్తూ దాదాపు యాభై నిమిషాలు గడిపారు. కాగా గోల్కొండ లాంటి పురాతన కట్టడాలు తమ దేశంలో లేవని, ఇలాంటి చారిత్రక కోటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాంకా అన్నారు.

చార్మినార్ పర్యటిస్తే
హైద్రాబాద్ పాత నగరంలో ఉన్న చార్మినార్ను ఇవాంకా ట్రంప్ సందర్శించేలా ప్లాన్ చేశారు. కానీ, భద్రతా కారణాలరీత్యా అమెరికా అధికారులు అనుమతించలేదు. పాతబస్తీలో చార్మినార్ సందర్శనతో పాటు లాడ్ బజార్లో గాజుల దుకాణాలను సందర్శించాల్సి ఉండేది. కానీ, భద్రతా కారణాల రీత్యా ఈ పర్యటనను రద్దు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications