Hyper Adi: జాగృతి ఫిర్యాదుపై హైపర్ ఆది రియాక్షన్... తన ఒక్కడి మీదే రుద్దవద్దని...
తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా స్కిట్ ప్రదర్శించాడని తనపై పోలీసులకు అందిన ఫిర్యాదుపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని అన్నారు. అసలు ఆ స్కిట్కి సంబంధించిన స్క్రిప్ట్ తాను రాయలేదని... తాను కేవలం అందులో ఒక ఆర్టిస్టును మాత్రమేనని వెల్లడించారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ద్వారా జాగృతి సభ్యులతో ఆది ఫోన్లో మాట్లాడారు.

హైపర్ ఆది ఏమంటున్నారు...
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... నిజానికి ఆ సమయంలో స్టేజీపై ఎవరేం పాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గౌరమ్మ,బతుకమ్మ వంటి పదాలేవీ తన నోటి నుంచి రాలేదన్నారు.స్టేజీపై చాలామంది ఉన్నారని... ఎవరు బతుకమ్మ అన్నారో,ఎవరు గౌరమ్మ అన్నారో తెలియదని అన్నారు. ఆ స్కిట్కి సంబంధించిన స్క్రిప్ట్ తన చేతిలో ఉండదని... దానికి తాను టీమ్ లీడర్ కూడా కాదని చెప్పారు.
తాను వెళ్లి జస్ట్ అందులో యాక్ట్ చేస్తానని తెలిపారు. అంతేకాదు,హైపర్ ఆది అలుసుగా దొరికాడని టార్గెట్ చేస్తున్నారనే తరహాలో ఆయన కామెంట్స్ చేశారు. తన ఒక్కడి పైనే ఇదంతా రుద్దవద్దని అన్నారు.ఒకవేళ తన తప్పు ఉంటే సారీ చెబుతానని అన్నారు.

బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే : తెలంగాణ జాగృతి
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ... హైపర్ ఆది బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఆ స్కిట్లో హైపర్ ఆది బతుకమ్మను కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైపర్ ఆది బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్లో తిరగనివ్వమని హెచ్చరించారు. సంపాదన కోసం,టీఆర్పీ రేటింగుల కోసం తెలంగాణ సంస్కృతి,భాషలను కించపరచడం సరికాదన్నారు. యావత్ తెలంగాణ ఆడపడుచులకు ఆది క్షమాపణలు చెప్పాలన్నారు. ఆదిపై తమకేమీ కక్ష లేదని... కానీ తెలంగాణను కించపరిస్తే ఊరుకునేది లేదని అన్నారు.

ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా హైపర్ ఆది స్కిట్ ప్రదర్శించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జాగృతి సభ్యులు హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని కోరారు.హైపర్ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్,మల్లెమాల ప్రొడక్షన్పై కూడా చర్యలు తీసుకోవాలని జాగృతి సభ్యులు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications