వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 'మోడీ నిర్ణయంపై బీజేపీ, ఆరెస్సెస్‌లో అసంతృప్తి'

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ నోట్ల రద్దు తీరుపై ఆరెస్సెస్, బీజేపీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

మోడీ నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక పురోగతిని తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ఆరు నెలల కష్టాలు, మూడేళ్ల నష్టాలు తెచ్చిందని వ్యాఖ్యానించారు. మోడీకి అనుభవం తక్కువ, అహంకారం ఎక్కువ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

<strong>చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?</strong>చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?

Jaipal Reddy lashes out at PM Modi

మోడీకి ప్రధానిగా పరిపక్వత, పరిణితి, ప్రజాస్వామ్య సహనం ఏదీ లేదన్నారు. మోడీ నిర్ణయంతో దేశానికి జరగరాని నష్టం జరిగిందని చెప్పారు. నోట్ల రద్దు అంశంపై బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రధాని చేయని నష్టాన్ని మోడీ తన ఒక్క నోట్ల రద్దు నిర్ణయంతో చేశారని ఆరోపించారు.

English summary
Congress leader Jaipal Reddy lashes out at PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X