మంచి పద్ధతి కాదు: మహా న్యూస్పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన
హైదరాబాద్: మహా న్యూస్ చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సీఈవో మూర్తి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించడాన్ని జనసేన పార్టీ గురువారం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మహా న్యూస్ వాహనాలను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని ఆ ప్రకటనలో పేర్కొంది. విజయనగరంలో జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదని పేర్కొంది.

ప్రతి ఒక్కరు మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఆ ప్రకటనలో పేర్కొంది. పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ ప్రకటన విడుదలైంది. వీటిని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లోను పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications