వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ-ఏపీలలో పోటీపై స్పష్టతనిచ్చిన జనసేన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన స్పష్టతనిచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

Jana Sena Party gives clarity on contesting in two Telugu States

ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పార్టీ ప్రతినిధులు జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలలో తిరుగుతూ పార్టీ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తాము తమ కార్యకర్తలతో చర్చించామని అన్నారు.

నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా, ముక్కు నేలకు రాయాలి: కేసీఆర్

Recommended Video

పవన్ నిషేధం..4 నుంచి 3 ఛానెల్స్ కు..ఏంటి మతలబు?

లక్షలాది మంది యువత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నారన్నారు. ఆగస్టు నాటికి పార్టీ ప్రణాళిక సిద్ధమవుతుందని, అది సిద్ధమయ్యాకు పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరఫున మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలిపారు. జనసేన దశ, దిశ ఎలా ఉండబోతుందో వివరిస్తారన్నారు.

English summary
Nemuri Shankar Goud, Telangana Jana Sena party in charge has given clarification stating that the party is contesting in the two Telugu States i.e. Andhra Pradesh and Telangana, in 2019 General Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X