శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై పవన్ కల్యాణ్ రియాక్షన్....
శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందడటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని.. 9 మంది మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
శ్రీశైలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. డీఈకి రూ.50లక్షలు,మిగతా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని... అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేట్ సంస్థ అమరరాజా ఉద్యోగులకు సైతం మానవతా దృక్పథంతో రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

కాగా,గురువారం రాత్రి 10.30 గంటలకు పవర్ ప్లాంట్ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగలు పవర్ ప్లాంట్ను కమ్మేయడంతో విధుల్లో ఉన్న 17 మంది ఉద్యోగులు అందులోనే చిక్కుకుపోయారు. ఇందులో 8 మంది ఉద్యోగులు ఎస్కేప్ టన్నెల్స్ నుంచి బయటపడ్డారు.
ఈ క్రమంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మిగతా వాళ్లు మాత్రం అందులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాతే ప్రమాద కారణాలు బయటపడుతాయని... అప్పటివరకూ దానిపై ఏమీ మాట్లాడలేమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications