అన్నను తప్పుబట్టిన తమ్ముడు.. : పార్టీని చక్కదిద్దే పనుల్లో 'జానారెడ్డి-రాజగోపాల్ రెడ్డి'
నల్గొండ : కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరే ప్రయత్నాల్లో మునిగిపోయారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో.. సీఎల్పీ లీడర్ జానారెడ్డి నల్గొండ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి, వలసలకు ఎలా బ్రేకులు వేయాలా అన్న అంశంపై చర్చించినట్టుగా సమాచారం.
ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలిని తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి సహా పార్టీ నేతలెవరైనా సరే కాంగ్రెస్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అలాగే పార్టీ మార్పుల గురించి స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురి చేయాలని చూడడం కేసీఆర్ పతనానికి నాంది పడడం కింద లెక్కే అని తెలిపారు.
నాపై చర్యలు ఈజీ కాదు, జానారెడ్డిని పనికిరారని తిట్టారుగా: కోమటిరెడ్డి
అంతర్గత గ్రూపు తగాదాలు, బలహీనంగా ఉన్న అభ్యర్థుల వల్లే ఎంపీగా ఓటమి పాలయ్యానని చెప్పుకొచ్చిన ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారాలనుకునేవారు ఒక్కసారి పునరాలోచించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అని ఆశాభావం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ ని అధికార పక్షం టార్గెట్ చేయడం సరైందని కాదని హితవు పలికారు.

కాగా, సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీలో భాగంగా.. జిల్లా రాజకీయాల గురించి లోతుగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్య నేతలు పార్టీని వీడే పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తిరిగి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై జానారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
జిల్లాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి భవిష్యత్తులో జిల్లా పార్టీ బాధ్యతలను ఇద్దరు కలిసి పర్యవేక్షించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ విషయాలన్ని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడానికి త్వరలోనే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లనట్టుగా సమాచారం. చూడాలి మరి, జానారెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు వలసలకు బ్రేక్ వేసి, పార్టీని బలోపేతం చేయడానికి దోహదపడుతాయో..!
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications