'ఓటుకు నోటు కేసులో ఏం ఒప్పందం కుదిరిందో అర్థం కావట్లేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏం ఒప్పందం కుదిరిందో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అసలు తిమింగలాన్ని వదిలి డ్రైవర్ను విమర్శించడం విడ్డూరమన్నారు. ఏం ఒప్పందం కుదిరింతో తెలియదన్నారు. ఓటుకు నోటు కేసు పక్కదారి పడుతోందన్నారు.
చెప్రాసీ ఉద్యోగం కోసం ఆంధ్రావారు పోరాడారు: టిఆర్ఎస్ ఎంపీలు
చెన్నైలో హైకోర్టులో చెప్రాసీ ఉద్యోగం కోసం ఆంధ్రావారు పోరాటం చేశారని, తాము తెలంగాణలో హైకోర్టు కోసం పోరాటం చేయవద్దా అని టిఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమన్, నగేష్, బీబీ పాటిల్లు శుక్రవారం అన్నారు. తెలంగాణకు హైకోర్టును కోరుతూ వారు పార్లమెంటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ప్రధాని మోడీ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు ఒత్తిడి చేస్తూ హైకోర్టు ఏర్పాటు ఆలస్యానికి కారణమవుతున్నారని చెప్పారు. హైకోర్టు విభజన పైన స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పార్లమెంటును స్తంభింప చేస్తామని చెప్పారు.