జూబ్లీహిల్స్ సమరం.. ఘర్షణలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కేసులు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన ఈ ఎన్నికలలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది ఒంటిగంట వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు 31.94 శాతం పోలింగ్ నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో అక్కడక్కడ చిన్నచిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఘర్షణలు
ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పలు సమస్యాత్మక ప్రాంతాలలో ఘర్షణలు నెలకొన్నాయి. అయితే పోలీసులు తాము ఏమి చెబుతున్నా పట్టించుకోవడంలేదని బి ఆర్ ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. బోరబండలోని పోలింగ్ స్టేషన్లో పార్టీ కార్యకర్తల పైన స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఆరోపించారు.

బోరబండ, షేక్ పేటలలో ఉద్రిక్తత
బోరబండలో పోలింగ్ స్టేషన్లలో కరపత్రాలతో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపణలు చేశారు. పరస్పర ఆరోపణలతో బోరబండలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగా షేక్ పేట డివిజన్లో ఉపఎన్నిక పోలింగ్ జరుగుతున్న క్రమంలో అభ్యర్థి మాగంటి సునీతను పోలింగ్ స్టేషన్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల పైన ఆమె మండిపడ్డారు.
దాడులు, కేసులతో ఉత్కంఠ
జవహర్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు అని, పోలీసులు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు షేక్ పేట డివిజన్లో బిజెపి యువమోర్చా డివిజన్ అధ్యక్షుడుపైన కాంగ్రెస్ నేతలు దాడి చేశారని బిజెపి నేతలు ఆరోపించారు. ఈ దాడులు మాత్రమే కాకుండా కేసులు నమోదు చేశారు. ఇక నిబంధనలను ఉల్లంఘిస్తున్న స్థానికేతర నేతల తీరుపై ఎన్నికలసంఘం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైన ఈసీ సీరియస్
ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పోలింగ్ బూత్ ల పరిసరాలలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైన ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు
ఈసీ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ప్రజాప్రతినిధుల పైన ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications