ఎన్టీఆర్ భవన్పై వెనక్కి: ప్లేస్, టైం మీరు చెప్పినా సరే... జూపల్లి మళ్లీ
మహబూబ్ నగర్: పాలమూరు ప్రాజెక్టులపై టిడిపి నేతలతో చర్చించేందుకు తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బహిరంగచర్చకు నేను సిద్ధమేనని, మీరు సిద్ధమేనా? నేను చెప్తున్న మూడు తేదీల్లో చర్చకు రావాలని, లేదా టైమ్ మీరు డిసైడ్ చేసినా సరేనని, వచ్చేందుకు నేను సిద్ధమేనని, టిడిపి కార్యాలయంలో చర్చ పెడితే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయని, అందుకే అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని, చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని, ప్రజలు, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని జూపల్లి సవాల్ విసిరారు.
అసెంబ్లీ కమిటీ హాల్ వేదికగా ఈ నెల 13, 15, 16 తేదీల్లో చర్చకు రావాలన్నారు. చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నానని చెప్తూనే జిల్లా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరి, మోసపూరిత లేఖలతో కేంద్ర ప్రభుత్వాన్ని, సంస్థలను తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకుంటున్న తీరును, టీడీపీ హయాంలో జిల్లాను ఉద్ధరించామని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్న టీడీపీ నాయకత్వపు డొల్లతనాన్ని ప్రజల ముందు ఆధారాలతో సహా బట్టబయలు చేయడానికి చర్చలో పాల్గొంటానని చెప్పారు.
మంచి - చెడ్డలు చర్చించడానికి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో తాను సిద్ధంగా ఉన్నానన్నారు. చర్చను టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. పాత్రికేయ సంఘాల ప్రతినిధుల సమన్వయంతో, పాత్రికేయులే న్యాయనిర్ణేతలుగా ఈ చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
తటస్థ వేదికగా అసెంబ్లీ కమిటీహాలులో చర్చను చేపట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. సోమవారం, బుధవారం, గురువారం మూడురోజుల్లో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి తాను సిద్ధమని, ఏదైనా ఇబ్బందులుంటే టీడీపీ నాయకులు నిర్ణయించే ఏ సమయానికైనా తాను సిద్ధమేనని చెప్పారు.
కాగా, పాలమూరు ఎత్తిపోతల పైన తాను చర్చకు సిద్ధమని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చి చర్చించేందుకు తాను సిద్ధమని జూపల్లి ఇటీవల చెప్పారు. దీంతో, రావుల చంద్రశేఖర రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నాలుగు గంటల పాటు నిరీక్షించారు. కానీ జూపల్లి రాలేదు. దీనిపై రావుల మండిపడ్డారు. దీంతో, జూపల్లి తటస్థ వేదిక కావాలన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications