తెలంగాణ ఆవిర్భావం: సొమ్మసిల్లిపడ్డ కడియం శ్రీహరి, ఆసుపత్రికి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
వరంగల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం నాడు హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో వేడుకలో పాల్గొన్నారు. ఆయన ప్రగతి నివేదిక చదువుతూ సొమ్మసిల్లి పడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అస్వస్థత కారణంగా సొమ్మసిల్లారని తెలుస్తోంది. వెంటనే స్పందించిన అధికారులు ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.












Click it and Unblock the Notifications