ఆ యూనివర్సిటీలో మొన్న చికెన్ కర్రీ కోసం కొట్లాట.. నేడు చపాతీ కోసం ధర్నా!
కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ లో వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న చికెన్ కర్రీ కోసం తలలు పగిలేలా కొట్టుకున్న విద్యార్థులు, నేడు చపాతీకి బదులుగా కిచిడీ పెట్టారని రోడ్డెక్కారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందుకు వచ్చి ధర్నా నిర్వహించారు.
మొన్న కాకతీయ యూనివర్సిటీలో చికెన్ కోసం కొట్టుకున్న ఘటన
కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ లో జరుగుతున్న ఘర్షణలు, ఫుడ్ విషయంలో కొనసాగుతున్న ఆందోళనలు చూసిన ప్రతి ఒక్కరికి విస్మయాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో విద్యార్థులకు భోజనం వడ్డించిన తర్వాత చికెన్ విషయంలో ఎంబీఏ, ఎకనామిక్స్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో తలలు పగిలే దాకా కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.

గొడవలు , కేసులు.. అయినా మారని విద్యార్థుల తీరు
దీనిపైన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొడవలతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఉన్నతాధికారులు గొడవలకు కారణమైన విద్యార్థులపైన యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ తాజాగా మరొక ఘటన చోటు చేసుకోవడం యూనివర్సిటీ అధికారులకు షాక్ అని చెప్పాలి. గొడవలు , కేసులు.. అయినా మారని విద్యార్థుల తీరుతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
కిచిడీ పాత్రను రోడ్డు మీదకు తెచ్చి ధర్నా
యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం సరిగా లేదని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఉదయం అల్పాహారం సమయంలో చపాతి పెట్టవలసిన చోట కిచిడీ పెట్టారని ఆగ్రహించిన విద్యార్థులు కిచిడి వండిన పాత్రను రోడ్డు మీదకు తెచ్చి ధర్నా నిర్వహించారు.
నాణ్యమైన భోజనం అందించటంలో యూనివర్సిటీ విఫలం
కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన సెకండ్ ఇయర్ పిజి విద్యార్థులు యూనివర్సిటీ కామన్ మెస్ లో భోజనం పైన అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం అందించడంలో యూనివర్సిటీ విఫలమైందని, ఉదయం పూట అల్పాహారం కూడా మెనూ ప్రకారం పెట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
యూనివర్సిటీ పరువు రోడ్డు పాలు
కామన్ మెస్ లో పెడుతున్న భోజనం పైన విద్యార్థుల తీరు, రోడ్డుకెక్కి చేస్తున్న ధర్నాలు, కర్రలతో తలలు పగలు కొట్టుకుంటున్న ఘటనలు వెరసి కాకతీయ యూనివర్సిటీ పరువు గంగలో కలిసిపోతుంది. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయాల్సిన, విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు కల్పించాల్సిన యూనివర్సిటీలు ఆ పాత్రను సరిగా పోషించడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
-
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!












Click it and Unblock the Notifications