గేరు మార్చిన కేసీఆర్ - ఆపరేషన్ షురూ, బిగ్ టర్న్..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణ పైన ఫోకస్ చేసారు. అటు ఎన్నికల సంఘం ఈ ఎన్నికల పై కసరత్తు చేస్తోంది. ఇటు కేసీఆర్ ఇదే సమయంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సభల ద్వారా తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా రెండు సభలకు నిర్ణయించారు. రేవంత్ ప్రభుత్వం లక్ష్యంగా కేసీఆర్ సమరానికి సిద్దం అవుతున్నారు.
ప్రజల్లోకి కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. విపక్ష నేత అసెంబ్లీ సమావేశానికి ఒక్క సారి మాత్రమే హాజరయ్యారు. పార్టీ నేతలతో అప్పుడప్పుడూ భేటీ అవుతున్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం కావటం పైన సీఎం రేవంత్.. మంత్రులు పలు సం దర్బాల్లో విమర్శలు చేసారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సూచించారు. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. ఈ సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

బీసీ - రైతు అంశాలపై
తాను మౌనంగా ఉంటూనే గంభీరంగా పరిస్థితులు గమనిస్తున్నానని తాజాగా పార్టీ నేతల భేటీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కుల గణన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అటు రైతు రుణమాఫీ అమలు తో పాటుగా రైతు భరోసా అమలు చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీసీ గణన పైన ఢిల్లీ నేతలను ఆహ్వానించి భారీ సభకు ప్లాన్ చేసింది. ఈ సమయంలో కేసీఆర్ సైతం బీసీ - రైతు అంశాల పైన రెండు భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం వేదికలను ఖరారు చేసారు. ఈ సభల ద్వారా తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కేటీఆర్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.
రెండు సభలతో
కామారెడ్డి వేదికగా బీసీ గర్జన, గజ్వేల్ వేదికగా రైతు గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. రైతు రుణమాఫీ..రైతు భరోసా అమలు పైనే ప్రధానంగా ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రశ్నించనున్నారు. అదే విధంగా కామారెడ్డిలో కాంగ్రెస్ గతంలో నిర్వహించిన సభ ప్రదేశంలోనే తాము భారీ సభ ఏర్పాటు చేసి బీసీలకు ఇచ్చిన హామీలు.. కులగణనలో చోటు చేసుకున్న లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. అటు బీజేపీ సైతం ఇదే అంశం పైన ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. దీంతో.. తెలంగాణలో మళ్లీ రాజకీయంగా కీలక పరిణామాలు.. మూడు పార్టీల సమరం హోరా హోరీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications