నా జాతకంలో ఒకటి ఉంది, నేను ఏదంటే అది జరుగుతుంది: కేసీఆర్
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన జాతకంలో ఒకటి ఉందని, నేను ఏది జరగాలని కోరుకుంటే అవన్నీ ఇప్పటికి జరిగాయన్నారు.
ఇప్పుడు నేను దత్తత తీసుకున్న ఎరవరవల్లి గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కల కూడా నెరవేరి తీరుతుందని చెప్పారు. ఎర్రవెల్లి గ్రామస్తులంతా అభివద్ధి చెంది వికసించిన ఒక పువ్వులా కనపడాలని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళఅలు పూర్తయి ఇళ్లలోకి వెళ్లినప్పుడే మనకు పండుగ అన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ ముందుకు వచ్చిందని చెప్పారు. ఇంటిటికీ గోదావరి నీళ్లు, 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఇంటికి ట్యాంక్ ఉంటుందన్నారు.
ఎర్రవెల్లి స్వయం సంవృద్ధి గ్రామమని,. గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలందరికీ తెలియాలని, రెండేళ్ల తర్వాత పాములవర్తికి గోదావరి జలాలు వస్తాయన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా ఎర్రవెల్లికే వస్తాయన్నారు. పంచాయితీలు పెట్టుకొని ప్రజలు సమయం వృథా చేసుకోవద్దన్నారు.
పంచాయితీలు, కొట్లాటలు లేకుండా గ్రామస్తులే చూసుకోవాలన్నారు. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగే బలమైందని, ఇళ్లలోకి వెళ్లే సమయానికి ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు అందజేస్తామన్నారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండితే రెండో పంటకు ఢోకా ఉండదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎర్రవెల్లిలో ట్రాక్టర్లు పంపిణీ చేశారు. గ్రామంలోని యువకులకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications