Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ Vs కేసీఆర్.. సై - ఇక నేరుగా, ముహూర్తం ఫిక్స్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. రేవంత్ వర్సస్ కేసీఆర్ రాజకీయ పోరాటం కొత్త టర్న్ తీసుకుంటోంది. చాలా కాలం తరువాత పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, కేసీఆర్ కు అసెంబ్లీకి రావాలని.. అక్కడ చర్చ చేయాలని రేవంత్ ఛాలెంజ్ చేసారు. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ సైతం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఇద్దరి మధ్య అసెంబ్లీ వేదికగా చోటు చేసుకునే రాజకీయం పై ఆసక్తి నెలకొంది.

సీఎం రేవంత్ - మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. కొడంగల్‌ వేదికగా గులాబీ బాస్‌కు బిగ్ సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతున్న వేళ.. నీళ్లా..నిధులా..నియమకాలా, సంక్షేమ పథకాలా.. ఆప్షన్ మీదే..ఏ అంశామైనా చర్చించేందుకు రెడీ అంటూ ఓపెన్ గా సవాల్ చేసారు.

kcr-planning-for-attend-assembly-sessions-to-counter-govt-as-reports

సభా వేదికగా ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేసారు. కేసీఆర్ సభకు వస్తే..కృష్ణా జలాల పైన చర్చ చేసి అన్ని అంశాలను ప్రస్తావించాని రేవంత్ భావిస్తున్నారు. అటు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే ముందే ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఈ వ్యవహారంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.

కృష్ణాజలాల అంశంతో పొలిటికల్‌గా తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని.. ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ వ్యూహం. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో సభలకు రెడీ అవుతున్నారు. ఈ మీటింగ్‌లకు తాను స్వయంగా హజరవుతానని..ఇక నుంచి ఐయామ్‌ ఆన్‌ ది ఫీల్డ్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు ఖరారయ్యాయి. సభకు రావాలని రేవంత్ సవాల్ చేసారు. దీంతో... కేసీఆర్ సైతం అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం.

సభలో తానే కృష్ణాజలాల పై మాట్లాడాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే.. బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కేసీఆర్ ద్విముఖ వ్యూహం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పాలమూరు నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. దీంతో.. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+