చేయాల్సింది చాలా ఉంది, అల్లా దయే: ఇఫ్తార్ విందులో కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: అల్లా దయవల్ల తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అన్నారు. రంజాన్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున ఆదివారం దావత్-ఎ-ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది.
నగరంలో నిజాం కాలేజీలో జరిగిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సంప్రదాయ దుస్తులు షెర్వానీ, పైజామా, రూమీ టోపీతో ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు.
ముస్లింల కోసం ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ‘మీ ఆశీస్సులు కావాలి' అని ముస్లిం సోదరులను ముఖ్యమంత్రి కోరారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
అల్లా దయవల్ల తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అన్నారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
రంజాన్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున ఆదివారం దావత్-ఎ-ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
నగరంలో నిజాం కాలేజీలో జరిగిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సంప్రదాయ దుస్తులు షెర్వానీ, పైజామా, రూమీ టోపీతో ముఖ్యమంత్రి హాజరయ్యారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
ముస్లింల కోసం ఇప్పటి వరకు చేసింది చాలా తక్కువని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ‘మీ ఆశీస్సులు కావాలి' అని ముస్లిం సోదరులను ముఖ్యమంత్రి కోరారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
హైదరాబాద్ నగరానికి గొప్ప సంస్కృతి ఉందని, ఇక్కడ గంగా, జమునా తహజీబ్ సంస్కృతి కలిగి ఉందని అప్పట్లోనే మహాత్మాగాంధీ అన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
గంగా, జమునా తహజీబ్ను కాపాడటానికి, తిరిగి ఆ సంస్కృతిని నెలకొల్పడానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
రంజాన్ పండుగను పురస్కరించుకొని లక్షా 96 వేలమంది పేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
ఇఫ్తార్ విందులో కెసిఆర్
ఇఫ్తార్ విందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు కె కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, నగరానికి చెందిన మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తెరాస నేతలు, అధికారులు, పలువురు ముస్లిం మతపెద్దలు, ప్రముఖులు హాజరయ్యారు.