వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీవ్ శర్మను ఆకాశానికెత్తిన కెసిఆర్
రాజీవ్ శర్మను ఆకాశానికెత్తిన కెసిఆర్
ఏమిలేని దశ నుంచి రాష్ర్టాన్ని తన పాలనా పద్ధతితో మంచి రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్శర్మను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. పరిపాలనలో అపార అనుభవం ఉన్న శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్రాన్ని అవినీతిరహితంగా మార్చారని, ఉమ్మడి పాలనలో సచివాలయంలో జరిగిన వ్యవహారాలకు, ఇప్పటికి ఎంతో తేడా కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన రాజీవ్శర్మ బుధవారం పదవీ విరమణ చేశారు.
Comments
English summary
Telangana CM K chandrasekhar Rao praised Rajiv sharma for for his services rendered to Telangana state.
Story first published: Thursday, December 1, 2016, 16:01 [IST]