శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి కేసీఆర్ శంకుస్థాపన, రివర్స్ పంపింగ్ ప్లాన్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్సీలోకి నీటిని తీసుకొస్తారు. ఇది ఉత్తర తెలంగాణకు ఉపయోగపడే ప్
పోచంపాడు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్సీలోకి నీటిని తీసుకొస్తారు. ఇది ఉత్తర తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టు.
దీంతో ఎస్సారెస్సీలో నిరంతరం నీరు పారేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో 16 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపేలా ప్లాన్ చేశారు. రూ.2వేల కోట్లతో పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.

శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు చేస్తున్న పునరుజ్జీవనంతో ఐదు జిల్లాల ప్రజలకు తాగు, సాగు నీటి కష్టాలు తీరిపోతాయని ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications