కెసిఆర్ను కలిసిన యాంకర్ ఉదయభాను, ఎందుకంటే?
హైదరాబాద్: ప్రముఖ యాంకర్ ఉదయభాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను బుదవారం నాడు కలిశారు. తన కవల పిల్లల పుట్టినరోజు వేడుకలకు హజరుకావాలని ఉదయభాను ముఖ్యమంత్రి కెసిఆర్ను ఆహ్వనించారు.
ఈ రోజు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని యాంకర్ ఉదయభాను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. కేసీఆర్ లాంటి డైనమిక్ లీడర్ను కలవడం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా కేసీఆర్తో దిగిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.
కేసీఆర్ తమను ఆశీర్వదించారని పేర్కొంది. ఉదయభాను కవల పిల్లల తొలి పుట్టినరోజు వేడుక వచ్చేనెల 3న హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ సందర్భంగానే ఆమె కేసీఆర్ను కలిసి, ఆ వేడుకకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం.
ఉదయభానుతో ఆమె భర్త విజయ్ కూడ ఉన్నారు. అయితే ఉదయభాను ఆహ్వనం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారని సమాచారం.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదయభాను పిల్లల పుట్టిన రోజు వేడుకలకు హజరౌతారో లేదో చూడాలి.