అర్చకులకు దసరా కానుక: నవంబర్ నుండి ప్రభుత్వ పే స్కేల్
తెలంగాణలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా కానుకను అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకులకు కూడా పేస్కేల్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా సందర్భంగా కానుకను అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అర్చకులకు కూడా పేస్కేల్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వంప్రకటించింది.
ప్రగతి భవన్ లో శుక్రవారం నాడు అర్చకులతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అర్చకుల సమస్యలు, ఆలయాల నిర్వహణ, వేతనాలు పెంపు, ధూపదీప నైవేద్యాలు తదితర అంశాలపై చర్చించారు.

నవంబర్ నుంచి అర్చకులు, ఆలయాల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పేస్కేలు అమలు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కెసిఆర్. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో మొత్తం 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందుతాయని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతాయని చెప్పారు
ప్రస్తుతం రాష్ట్రంలోని 1,805 దేవాలయ్యాల్లో ధూపదీప నైవేద్యాలు అమలవుతున్నాయని... ఈ పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
దేవాలయాల నిర్వహణ పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తామని... దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గిస్తామని తెలిపారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications