ప్రముఖ సాహిత్యవేత్త కేశవరెడ్డి వర్ధంతి సభ: స్మృతి సంపుటి ఆవిష్కరణ
హైదరాబాద్: ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవ రెడ్డి ప్రథమ వర్ధంతి సభ ఈ నెల 13వ తేదీ సాయంత్రం హైదరాబాదులో జరగనుంది. ఈ సంస్మరణ సభ 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు దోమలగుడాలో ఇందిరా పార్కు సమీపంలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరుగుతుంది.
ఈ సందర్భంగా కేశవ రెడ్డి స్మృతి సంపుటి ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఈ సభలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. వరవర రావు, మోహన్, నిఖిలేశ్వర్, డాక్టర్ సాయినాథ్, జయప్రభ, విమల, కాండ్రేగుల నాగేశ్వర రావు పాల్గొంటారు.

వారితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు, అంబటి సురేంద్ర రాజు, నందిగం కృష్ణారావు, గోరటి వెంకన్న, పరవస్తు లోకేశ్వర్, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, నాళేశ్వరం శంకరం, గుడిపాటి కూడా కేశవ రెడ్డి ప్రథమ వర్థంది సంస్మరణ సభలో పాల్గొంటారు.
కేశవ రెడ్డి రాముండాడు రాజ్యముండాది. అతడు అడవిని జయించాడు, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ వంటి నవలలు రాసి తెలుగు నవలా సాహిత్యంలో తనకు సాటిలేదని నిరూపించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కేశవ రెడ్డి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని విక్టోరియా ఆస్పత్రిలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications