కాసేపట్లో కదలనున్న ఖైరతాబాద్ గణేణుడు: దిగిన 6 వేల కిలోల లడ్డు
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు కొద్దిసేపట్లో నిమజ్జనానికి కదలనున్నాడు. ఆరు వెల కిలోల లడ్డూను నిర్వహకులు కిందికి దించారు. ఈ లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30వ తేదీన గణేష్ మండపం వద్ద పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
స్వామి విగ్రహం చుట్టూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్వామిని శోభా యాత్రకు సిద్ధం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిమజ్జన కార్యక్రమం పూర్తి కావచ్చునని భావిస్తున్నారు.

కాగా, ఆదివారం నుంచి హుస్సేన్ సాగర్లో వినాయకుల నిమజ్జన కార్యక్రమం సాగుతూనే ఉంది. శోభా యాత్ర హైదరాబాద్లో మొజంజాహీ మార్కెట్కు చేరుకుంది. వినాయకుల విగ్రహాలు బషీర్బాగ్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు బారులు తీరి ఉన్నాయి. బషీర్ బాగ్ వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
హైదరాబాదులోని గన్ఫౌండ్రీలో 22 అడుగుల గణేశుడి విగ్రహాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడింది. ఈ సంఘటనలో కొందరు భక్తులు గాయపడ్డారు. ఆదివారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్కు విగ్రహాలు తరలి వస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి గానీ నిమజ్జన కార్యక్రమం పూర్తి కాదు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications