హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌పై జోకులు, కేసీఆర్‌ గాలిమేడలు: రోడ్లే వేయలేదంటూ కిషన్ ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అమెరికా, యూరప్, ఇస్తాంబుల్ చేస్తామని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి,

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అమెరికా, యూరప్, ఇస్తాంబుల్ చేస్తామని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.

బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణించే రోడ్డే అధ్వాన్నంగా మారిందన్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Kishan Reddy fires at KCR and KTR

మున్సిపల్ మంత్రి విదేశీ పర్యటనలు చేస్తూ హైదరాబాద్ కూడా అలాగే ఉందనే అపోహలో ఉన్నారని, కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం లోపించిందని మండిపడ్డారు.

వారానికోసారి కూడా మంచినీళ్లు రావడం లేదని, మెట్రో రైలు పని పడకేసిందని కిషన్ రెడ్డి అన్నారు. పండగలకు కూడా సరైన సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఇదేనా మీరంటున్న విశ్వనగరం అని మంత్రి కేటీఆర్‌ను ఆలత ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌పై సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అయితే గాలిలో మేడలు కడుతున్నారని ధ్వజమెత్తారు.

English summary
BJP MLA Kishan Reddy on Wednesday fired at Telangana CM K Chandrasekhar Rao and Minister KTR for Hyderabad development issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X