Kishan Reddy: అక్కడ రైళ్లు ఆపాల్సిందే.. లేఖ రాసిన కిషన్ రెడ్డి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు చోట్ల రైళ్లు ఆపాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. మహబూబ్నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యశ్వంత్ పూర్-హజరత్ నిజా ముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును ( ట్రైన్ నెం.12649/12650) మహబూబ్ నగర్ లో ఆపాలని కోరారు. తెలంగాణలో కాచిగూడ మీదుగా వెళ్లే ఈ ట్రైన్ కర్నూలు చేరుకునే వరకు 200 కి.మీ మేర మధ్యలో ఎక్కడా ఆగదని గుర్తు చేసిన మంత్రి మహబూబ్ నగర్ లో ఆపితే బాగుంటుందన్నారు.
మహబూబ్ నగర్ లో రైలు ఆగినట్లయితే ఢిల్లీ, బెంగళూరు ప్రయాణించే వారికి హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదని లేఖలో వివరించారు. చెంగల్ పట్టు-కాచిగూడ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం.17651/17652)కు షాద్నగర్ రైల్వే స్టేషన్ లో ఆపాలన్నారు. దీంతో హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలోని ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. తెలంగాణలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో గణనీయమైన పురోగతి జరుగుతోందని, మౌలికవసతుల కల్పన వేగవంతమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్ల సంఖ్యను పెంచుతామన్నారు.

వందే భారత్ రైలులో ప్రస్తుతం 8 కోచ్లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో 52 సీట్లు, చైర్కార్లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్లో 131 శాతంగా నమోదైంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

మరోవైపు ఉదయం 6గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరనుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications