బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలకలం: నేతలు, అభిమానుల తాకిడి, భద్రత కట్టుదిట్టం
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంనగర్లోని దత్తాత్రేయ ఇంటికి నేతలు, అభిమానుల తాకిడి పెరిగింది.
బుధవారం ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్లోకి వచ్చారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిమానులు ఆయనతో ఫొటోలు దిగుతుండగా.. తోపులాట జరిగింది.

ఈ క్రమంలో అక్కడ చిన్నపాటి కత్తి(పెన్సిల్ కట్టర్) పడిపోయింది. గుర్తించిన కార్యకర్తలు దాన్ని దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ నివాసంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మాజీ డీజీపీ హెచ్జే దొరతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు దత్తాత్రేయను కలిసి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న దత్తాత్రేయ రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ఆయనకు మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి లభించింది. అంతకుముందు అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలోనూ దత్తాత్రేయ కేంద్రమంత్రిగా పనిచేశారు.
2019లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. పని చేసే కార్యకర్తలకు బీజేపీలో ఎప్పుడూ న్యాయం జరుగుతుందని, ఇందుకు తాను ఉదాహరణ అని బండారు దత్తాత్రేయ ఇటీవల వ్యాఖ్యానించారు. తనను గవర్నర్గా నియమించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications