Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పాలసీ ఏంటి.. అందులో ఏముంది?

విదేశాలతో పోటీ పడేలా, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పాలసీ' డాక్యుమెంట్‌ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రైజింగ్ 247 పాలసీ పైన ఆయన ప్రత్యేకమైన దృష్టితో ఉన్నారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు. అసలు ఈ తెలంగాణా రైజింగ్ 2047 పాలసీ ఏంటి? అనేది కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గసూచిక తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఒక దీర్ఘకాలిక మార్గ సూచిక అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని తీసుకొస్తున్నారు.

Know What is the Telangana Rising vision-2047 policy that CM Revanth Reddy considers prestigious

Take a Poll

తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ లక్ష్యం ఇదే
2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడం, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నారు. అంతేకాదు దేశ స్థూల జాతీయోత్పత్తికి తెలంగాణ నుండి 10 శాతం వాటాను అందించడం కూడా ఇందులో లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో తెచ్చిన పాలసీ
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ప్రాంతాల వారీగా విభజించి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేసేలా ప్లాన్ చేశారు కోర్‌ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీ.. ఇలా మూడు రీజియన్లుగా విభజించుకోవాలని సూచించారు.మానవ వనరుల అభివృద్ధి పైన, మౌలిక సదుపాయాల కల్పన పైన, సామాజిక సంక్షేమం పైన, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన పాలసీగా దీనిని తీసుకురానున్నారు.

గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించాలని సీఎం రేవంత్ ఆలోచన
ఈ విజన్ డాక్యుమెంట్ ను త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో నిన్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025'పై సమీక్షలో అధికారులు పాలసీ డాక్యుమెంట్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడంతోపాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను సదస్సు జరిగే రెండు రోజుల్లో ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 'తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047' డాక్యుమెంట్‌.. రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం అని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+