కేసీఆర్కు కొత్త ఇల్లు అవసరమా?: కోదండరాం సంచలనం
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మరోసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి కొత్త నివాసం అవసరమా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మరోసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి కొత్త నివాసం అవసరమా? అని ప్రశ్నించారు. ఆయన సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సమస్యలు వినడానికి ప్రభుత్వం సుముఖంగా లేనట్లుందని కోదండరామ్ అన్నారు. ముఖ్యమంత్రి కొత్త ఇళ్లు కావాలనుకుంటే ప్రభుత్వ భవనాలు చాలా ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోకుండా ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం సరికాదన్నారు.
ఎనిమిది ఎకరాల్లో చేపట్టిన సీఎం కొత్త ఇల్లు నిర్మాణం ఏడాదిలోనే పూర్తయిందని.. కానీ పేదలకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం మాత్రం ఏళ్ల పాటు కొనసాగుతోందని కోదండరామ్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications