ఆ 105మందికీ డౌటే! ఒక్క మాటంటే జగన్ వెంటే ఉండేవాళ్లం: కొండా సురేఖ, ‘సిగ్గులేని ఎర్రబెల్లి’
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని బలి చేస్తున్నారని ఆ పార్టీపై వరంగల్ తూర్ప తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో కొండా మురళితోపాటు ఆమె మీడియాతో మాట్లాడారు.
మరోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే.. టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకోరనే ఇలా చేశారని, ఇది మంచిది కాదని కొండా సురేఖ అన్నారు.

నిబంద్ధతో పనిచేశాం
తాము టీఆర్ఎస్ పార్టీలో నిబద్ధతగా పనిచేశామని, అసెంబ్లీలో మాజీ మంత్రి అరుణ కలిసినా మాట్లాడలేకపోయామని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకే సందర్భంలో గవర్నర్ వద్ద కలిశాం తప్ప మరెప్పుడూ కలవలేదని చెప్పారు. పార్టీ హైకమాండ్కు చెప్పకుండా ఏమీ చేయలేదని అన్నారు. 24గంటల్లో సమాధానం చెప్పకపోతే తమ నిర్ణయం ప్రకటిస్తామని కొండా సురేఖ చెప్పారు.

ఆ 105మందికీ నమ్మకం లేదు..
105మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి తన పేరును ప్రకటించని కారణంగానే తాము మీడియా ముందుకు వచ్చామని కొండా సురేఖ తెలిపారు. అయితే, 105మందికి బీఫాం ఇస్తారా? ఇవ్వరా? అనేది కూడా నమ్మకం లేదని అన్నారు. ఈ 105లో ఎన్నికల సమయానికి సగం మందిని తొలగించినా ఆశ్చర్యం లేదని అన్నారు.

సిగ్గులేకుండా ఎర్రబెల్లి..
తాము టీడీపీలోకి వస్తామంటే తమ కోట అని మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. సిగ్గులేకుండా ఇప్పుడు తామున్న టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారని కొండా సురేఖ మండిపడ్డారు.

జగన్ ఆ ఒక్క మాటంటే..
కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేయడంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లామని చెప్పారు. ఒక వేళ జగన్ ప్రో తెలంగాణ అంటే ఓడిపోయినా ఆయన వెంటే ఉండేవాళ్లమని కొండా సురేఖ చెప్పారు. టీఆర్ఎస్ వాళ్లే పిలిచి టికెట్ ఇస్తే పోటీ చేశామని చెప్పారు.

తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబ కాదు.. ముందస్తు సరికాదు
తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ముందస్తు నిర్ణయం సరైందని కాదని అన్నారు. కొండా మురళీ మాట్లాడుతూ.. మధుసూదనా చారి కోరితే తామే ఆయన కోసం గత ఎన్నికల్లో భూపాలపల్లిలో ప్రచారం చేశామని చెప్పారు. తాము పార్టీ మారితే అందరికీ చెప్పే మారతామని చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications