ప్రచారంలో ఆమె స్టైలే వేరు.. బీఆర్ఎస్ ఆఫీసుకెళ్ళి కాంగ్రెస్ కు ఓటెయ్యమన్న కొండా సురేఖ!!
ఆమె ఒక మాస్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న లీడర్. ఆమె ఏమి మాట్లాడినా, ఎవరిపైనైనా ధిక్కార స్వరం వినిపించినా రాష్ట్రంలో సంచలనంగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో చారిత్రక నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కొండా సురేఖ ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న కొండాసురేఖ ఓటర్ల మద్దతు తనకు దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో సహజంగా ఒక అభ్యర్థికి మరో అభ్యర్థి తారసపడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఎన్నికల ప్రచారాన్ని సాగించే క్రమంలో ప్రత్యర్థి పార్టీల కార్యాలయాల వైపు కానీ, ప్రత్యర్థుల ఇళ్ళ వైపు కానీ చాలామంది అభ్యర్థులు వెళ్ళరు. కానీ కొండా సురేఖ వంటి కొందరు నేతలు మాత్రం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తారసపడితే కూడా తనకే ఓటేయమని కచ్చితంగా అడుగుతారు. అటువంటి సందర్భమే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారంలో భాగంగా వరంగల్ నగరంలోని పెరుక వాడ బొడ్రాయి వద్ద ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఏకంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన కొండా సురేఖ అక్కడ ఉన్న వారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా ప్రతి ఒక్కరిని ఓటు అడగడం తన కర్తవ్యమని, ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎదురుపడినా కచ్చితంగా తనకి ఓటేయమని అడిగి తీరుతానని కొండ సురేఖ చెప్తున్నారు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులను కూడాతనకు ఓటేసి గెలిపించమని అడుగుతూనే కొండా సురేఖ, మరోవైపు భారీగా చేరికలపై దృష్టి సారించారు.
బీఆర్ఎస్ ఆఫీసుకెళ్ళి కాంగ్రెస్ కు ఓటెయ్యమన్న కొండా సురేఖ..!!#KondaSurekha #BRS #Congress #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaAssemblyElections #TelanganaElection2023 #TSAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/oSyQTQtDqg
— oneindiatelugu (@oneindiatelugu) November 22, 2023
ఇప్పటికే పలువురు కార్పోరేటర్ లను కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకునేలా చేసిన కొండ సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోపక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్పు కావాలి సురేఖ గెలవాలి అని కొండా మురళి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరికలకు ఆయన చక్రం తిప్పుతున్నారు. వరంగల్ తూర్పు లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications