రిజైన్.. చంద్రబాబుకు కృష్ణయాదవ్ షాక్: కెసిఆరే స్మార్ట్సిటీ వద్దన్నారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్ శుక్రవారం నాడు ఝలక్ ఇచ్చారు. ఆయన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో తన వర్గానికి అవకాశం ఇవ్వలేదని ఆయన రాజీనామా చేశారు.
స్మార్ట్ సిటీ చేయవద్దని అన్యాయం చేసింది: కిషన్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీ చేయవద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం నాడు ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సాయం తప్పనిసరిగా అవసరమని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం - బిజెపి గెలుపు ఖాయమని చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.50వేల కోట్ల సాయం చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఆర్భాటం చేశారనే కానీ చివరకు చెత్త నగరంగా మార్చారన్నారు.

తెరాస పాలనలో నగరం విశ్వనగరంగా కాదని, విషనగరంగా మారుతోందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ కూటమికి అవకాశమిచ్చి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ వల్లే హైదరాబాదుకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కెసిఆర్ నెరవేర్చలేదన్నారు. కిషన్ రెడ్డి, ఎల్ రమణలు టియుడబ్ల్యుజే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications