పారిశుధ్యంపై సీరియస్ అయిన కేటీఆర్ .. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి వార్నింగ్
నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దేవరకొండ మున్సిపాలిటీ పైన పటారం లోన లొటారం అన్నట్టు వుందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, చైర్మన్ , కమీషనర్ పై అసహనం వ్యక్తం చేశారు .మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
దేవరకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన
దేవరకొండలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నెట్వర్క్, రోడ్లు, పార్క్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు
ఇక పొడి, తడి చెత్తను వేరుచేయడానికి 8 వేల ఇళ్లల్లో ప్రతి ఇంటికి రెండు డబ్బాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు పరిచయం కార్యక్రమంతో సిబ్బందితో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.దేవరకొండ మున్సిపాలిటీలో పరిస్థితి బాగా మెరుగుపడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం కేవలం పచ్చదనం కోసమే వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు . 80 శాతం మొక్కలు బతికించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.
Recommended Video

పారిశుద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానా
వార్డుల్లో మొక్కల పెంపకానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కూరగాయల మార్కెట్, పార్క్, శ్మశానవాటికలు నిర్మించాలన్నారు.తాగునీటి నిర్వహణ వ్యవస్థపై వార్డు సభ్యులు సమీక్షించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపి సురక్షితమైన నీరందించాలన్నారు. నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించాలని పేర్కొన్నారు. అక్కడ చెత్తా చెదారం ఎక్కడివి అక్కడే పేరుకుపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . పారిశుధ్య పనులపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని మున్సిపల్ కమిషనర్, చైర్మన్, కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానా విధించాలని అధికారులకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications