పంట పొలంలో చెమటోడ్చిన కేసీఆర్: ఫొటోలు పెట్టి కేటీఆర్ ఇలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్కు వ్యవసాయ క్షేత్రం ఉన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తీరిక దొరికినా సీఎం కేసీఆర్.. తన ఫాంహౌస్లో వాలిపోతారు.
అక్కడవున్న పంటలు, మొక్కలను పరిశీలిస్తూ సేదతీరుతారు. పంట పరిస్థితి గురించి పర్యవేక్షకులను అడిగి తెలుసుకుంటారు. కాగా, కేసీఆర్ తన ఫాంహౌస్లో వ్యవసాయ పనుల్లో స్వయంగా పాలుపంచుకుంటున్నప్పటి ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

నాయకత్వం అంటే పదవులు.. బిరుదులు కాదని.. ఒకరి జీవితాన్ని మరొకరు ప్రభావితం చేయడమేనని మంత్రి కేటీర్ వ్యాఖ్యనించారు. కేటీఆర్ పోస్టు చేసిన ఫొటోల్లో సీఎం కేసీఆర్ పొలంలో ఏదో పని చేస్తున్నట్లు కనిపించారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ పంటలను పరిశీలించారు.












Click it and Unblock the Notifications