ఇక్కడ చంద్రబాబు నిరసనలొద్దు-లోకేష్ కూ అదే చెప్పా-అందరూ ఫ్రెండ్సేనన్న కేటీఆర్..
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న నిరసనలపై మంత్రి కేటీఆర్ ఇవాళ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అక్కడి రెండు పార్టీల మధ్య విషయమని కేటీఆర్ తెలిపారు. అది ఏపీకి చెందిన విషయమని, హైదరాబాద్ లో ర్యాలీలు తీయడం, ప్రతిగా ఇంకో పార్టీ చేయడం సరి కాదన్నారు. ఏపీకి చెందిన విషయాన్ని ఆందోళనలు అక్కడే చేయాలని కేటీఆర్ సూచించారు.
ర్యాలీల వల్ల ఐటీ కంపెనీల విషయంలో ఇబ్బందులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. తనకు ఏపీ నేతలతో ఎటువంటి ఇబ్బంది లేదని కేటీఆర్ తెలిపారు. తనకు జగన్, చంద్రబాబు, పవన్ అందరూ మిత్రులే అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా తమ పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడి ఉంటే అది వారి వ్యక్తిగతమన్నారు. దీనిపై తమ స్టాండ్ స్పష్టంగానే ఉందన్నారు. చంద్రబాబు ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు.

చంద్రబాబు అరెస్ట్ తో తెలంగాణ కు ఏం సంబంధం అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ లో ఎందుకు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారని నిరసనకారుల్ని ప్రశ్నించారు. ఏపీలో ఏమన్నా చేసుకోండని వారికి సూచించారు. ఇది రెండు రాజకీయ పార్టీల తగాదా ఇందులో తమకేం సంబంధం అని ఆయన అడిగారు. ఇక్కడ ఎలాంటి ఆందోళనలు చేయద్దని కేటీఆర్ సూచించారు.
చంద్రబాబు అంశం కోర్టులో ఉందని గుర్తుచేశారు.
చంద్రబాబు అరెస్టు విషయంలో నిరసనలతో తెలంగాణాలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తనకు లోకేష్ ఫోన్ చేసి ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వమని అడిగారని కేటీఆర్ వెల్లడించారు. అయితే హైదరాబాద్ లో శాంతి భద్రతలు ముఖ్యం అని ఆయనకు చెప్పామని కేటీఆర్ తెలిపారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications