గూగూల్ సహా..: కెటిఆర్, త్వరలోనే ఆర్టీసి విభజన: మహేందర్ రెడ్డి
హైదరాబాద్: గూగుల్ సహా మరికొన్ని ఐటి కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. ఆయన మంగళవారంనాడు తాజ్ దక్కన్లో థాంసన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రారంభించారు.
హైదరాబాద్లో పెద్ద ఎత్తున పలు కంపెనీల ఏర్పాటు కృషి చేస్తున్నామని తెలిపారు.ఐటీఐఆర్పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.

ఇదిలావుంటే, త్వరలోనే ఆర్టీసీ విభజనను పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి మంగళవారంనాడు సమీక్ష నిర్వహించారు. సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ పాలకవర్గాన్ని నెలలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పక్కరాష్ట్రం కంటే తెలంగాణలో బస్సు ఛార్జీలు తక్కువ అని తెలిపారు. ప్రజలపై భార మోపే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఉద్ఘాటించారు. తెలంగాణలో కొత్తగా 12 ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications