ఛీ..ఛీ.. మనుషులా..? రాక్షసులా..? కారుతో గుద్ది.. కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లి..
హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకూ ఆకతాయిల ఆగడాలు ఎక్కువై పోతున్నాయి. బుద్దిగా చదువుకోవాల్సిన ఏజ్ లో మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. గల్లీల్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం.. మహిళలు, యువతులను ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ లో తాకుతూ వెళ్లడం.. ఇష్టానుసారం రోడ్లపై బైక్ ల మీద అరుస్తూ ఇతరులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. భావి తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువత ఇలా బాధ్యత మరచి ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన ఓ నిదర్శనం అని చెప్పొచ్చు.
హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో దారుణం జరిగింది. పోకిరీల ఆగడాలకు ఓ నిండు ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఆ యువకులు మనుషులుగా కాకుండా రాక్షసుల మాదిరి ప్రవర్తించారు. ఓ వ్యక్తిని కారుతో గుద్ది.. కిలో మీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. కారు కు సైరన్ వేసుకుంటూ వెళ్తూ.. నడిరోడ్డుపై హంగామా సృష్టించారు. పోకిరీలు సైరన్ వేసుకుంటూ.. రోడ్డు పై ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..?
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రైవేట్ ఉద్యోగి సతీష్ కారును.. కొందరు పోకిరీలు బొలెరో కారుతో గుద్ది ఆపకుండా వెళ్లిపోయారు. అయితే కొద్ది దూరం వరకు వెంబడించి.. యువకుల కారును సతీష్ ఆపాడు. బొలెరో కారుకి ఎదురుగా నిల్చుని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా.. సతీష్ ను కారుతో ఢీ కొట్టారు ఆ యువకులు. దాంతో సతీష్ కింద పడిపోయాడు. అలా కారు బంపర్ ను పట్టుకున్నాడు. అయితే కారు కింద సతీష్ ఉన్నాడని తెలిసినా ఆ యువకులు అలాగే కారు నడుపుకుంటూ 700 మీటర్ల వరకు వెళ్లారు.
అయితే ఈ ఘటనలో సతీష్ వీపు అంతా చెక్కుకు పోవడంతో బంపర్ ను వదిలేశాడు. దాంతో సతీష్ పై నుంచి కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో సతీష్ ప్రైవేట్ పార్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కాలు విరిగిపోయింది. ప్రస్తుతం సతీష్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే కారుకి సైరన్ ఎందుకుంది..? కారులో ఉన్న యువకులు ఎవరు..? మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా..? అనే విషయంపై పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పడం లేదని సతీష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications