వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణపై ఆ నలుగురి కుట్రల్ని టిడిపి విచ్ఛిన్నం చేస్తుంది'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట్లోని నలుగురి కబంద హస్తాల్లో చిక్కుకుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ మంగళవారం నాడు ఆరోపించారు. టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభమైంది.

కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎల్ రమణ పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల ఇంచార్జ్ పెద్దరెడ్డి నుంచి సభ్యత్వ నమోదు కార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. తెరాస ప్రజలను మోసగిస్తూ పాలన కొనసాగిస్తోందన్నారు.

వారి కుట్రలను విచ్ఛిన్నం చేసే శక్తి టిడిపికి మాత్రమే ఉందన్నారు. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే సత్తా టిడిపికే ఉందన్నారు. పేద కార్యకర్తల కోసం టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

trs

నెహ్రూను కించపరిచేలా మాట్లాడొద్దు: వీహెచ్‌

మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూలను కించపరిచేలా బీజేపీ నేతలు మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంత రావు వేరుగా అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో నెహ్రూను తక్కువ చేసి మాట్లాడారన్నారు.

పటేల్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడేూ తక్కువ చేయలేదన్నారు. నెహ్రూను తక్కువ చేసి, పటేల్‌ను ఎక్కువ చేయాలని మోడీ చూస్తున్నారన్నారు. చరిత్రను మార్చడం ఎవరితరం కాదని, పటేల్‌ గుజరాత్‌కు చెందిన వాడు కాబట్టి ప్రధానిని చేయలేదని అనడం సరికాదన్నారు.

English summary
Telangana Telugudesam Party chief L Ramana lashes out at KCR and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X