Telangana: సీఎం రేవంత్ రెడ్డికి రూ.5.5 కోట్ల చెక్ ను అందజేసిన ఎల్ అండ్ టీ..
రాష్ట్రంలో నెలక్రితం కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగులో పంట నష్టంతో పాటు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీంతో వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా లార్సెన్ అండ్ టూబ్రో(L&T) వరద బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5.5 కోట్ల విరాళం ఇచ్చారు.
బుధవారం తెలంగాణ సచివాలయంలో ఎల్అండ్ టీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎల్అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని చెక్కులు ఇచ్చారు. చిరంజీవి, తన కుమారుడు రామ్ చరణ్ వేర్వేరుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా.. ఆ చెక్కులను అందించారు. మహేశ్ బాబు దంపతులు కూడా రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు.

బాలకృష్ణ చిన్న కూతురు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ఇచ్చారు. ఇలా టాలీవుడ్ చెందిన ప్రముఖులు ప్రకటించిన ప్రకారం చెక్కులు అందజేశారు. కుమారి ఆంటీ కూడా వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమె చెక్ అందజేశారు. ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ 5.50 కోట్ల రూపాయల విరాళం అందించింది. @larsentoubro చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. ఎన్. సుబ్రమణ్యన్ గారు సచివాలయంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారిని, ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారిని కలిసి ఆ మేరకు… pic.twitter.com/RxCd5u9qZz
— Telangana CMO (@TelanganaCMO) October 9, 2024
కాగా కేంద్రం కూడా రాష్ట్రాలకు వరద సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ పండ్ అడ్వాన్స్ సాయం ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.416.80 కోట్లు ఇవ్వగా.. ఆంధ్రప్రదేశ్ కు రూ. 1,036 కోట్లు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మహారాష్ట్రకు నిధులు ఇచ్చారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications